"ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః"
ఈ స్మ్రుతి వాక్యం ప్రకారం ఇహ లోకంలో పరలోకంలో ఆనందం ఇచ్చేది "చేయటం" ధర్మమట. ( ఈ వాక్యానికి
త్రిదండి స్వామీ వారి వివరణ ఇక్కడ చదవండి)
ఇది ఒక జీరో సం గేం లేదా ప్రిసనర్స్ డిలేమాను గుర్తు చేస్తోంది. (see
prisoners dilemma) and (
zero sum game)
"నాకు ఇష్టమైన పనులను చేయొద్దు" అని చెప్పటమే ధర్మ వాక్యంగా ఎరుగుదును ఇప్పటివరకు. చిన్నప్పటినుంచి అనుకునే వాడిని "ఎందుకు మంచి/ధర్మం ఎప్పుడూ నాకు ఇష్టమైన పనులను చేయొద్దు అనే చెపుతుంది" అని.
ఈ స్మ్రుత్యర్తాన్నీ నా వైయుక్తిక అనుభవాన్ని జోడిస్తే ఇక్కడ ధర్మం మన సాంఘిక జీవనం ఒక జీరో సం గేం అని చెపుతూ అందులో "అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే" ఆప్టిమల్ సొల్యూషన్" ఏమిటో ఆ మార్గాన్ని అవలంబించమని చెపుతుంది అనిపించింది.
గాంధీగారు అన్నట్టు ప్రకృతిలో అందరి అవసరాలకు మించి సంపదుంది కాని ఒక్కడి లోభత్వాన్ని దురాసనూ తీర్చే సంపద ఈ ప్రపంచం మొత్తం మీద లేదు అన్నది చెపుతోంది అనిపిస్తుంది.
అందుకే
ధర్మమెపుడూ "నియంత్రనే" చేస్తుంది.
అందుకనే ధర్మానుస్థానం కష్టం.
స్మ్రుతి వాక్యాన్ని పరిచయం చేసిన
మానస గారికి ధన్యవాదాలు.