తత నాందీ ముఖీం రాత్రీం సూత మాగధాః
తుష్టువుర్వాగ్విశేషఙ్ఞాః స్తవైః మంగళ సమ్హితైః
"................
సతూర్య ఘోషః సుమహాన్ దివం ఆపూరయాన్నివ
భరతం శోక సంతత్పం భూయ శొకైః అరంధయత్
తత్ర ప్రభ్భుధ్ధోః భరతః తం ఘొషం సమ్నివర్త్యచ
న అహం రాజ ఇతి చ అపి ఉఖ్త్వా శతృఘ్నం ఇదం అభ్రవీత్
( వశిష్టునిచేత పురమాయింపబడిన?) సూత మాగధులు మొదలైన వారు, మంగళవాద్యకారులూ తమ తమ నెలవులననుసరించి భరతుని మంగళధ్వనులతోనూ, మంగళవచనములతోనూ నిద్రలేప చూస్తే నిద్రలో ఉన్న భరతుడు "నేను రాజును కాను" అంటూ లేచి వారిని ఆపాడట
అనుజగ్ముషచ తం సర్వే మంత్రిణా సపురోహిత్స్సః
బభూర్వుష్చ ముదా యుక్తాః తం దృష్ట్వా వెశ్మ సంవిధిం 2-91-37
తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవచ
భరతోమంత్రిబిర్సారధం అభ్యవర్తత్ రాజవత్ 2-92-38
(అన్నను వెతికి పట్టుకుని ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన స్థానంలో తాను వనవాసం చెస్తానంటూ బయలుదేరిన భరతుడు, భరధ్వాజ మహర్షి బలవంతపు ఆతిధ్యానికి కట్టుబడి ఆతిధ్యానికై సృష్టింపబడిన రాచమందిరంలోని రాజాసనాన్ని, ఛత్రఛామరాలను శ్రీరామునివిగానే భావించేసి బహ్రతుడూ మంత్రులూ ప్రదక్షిణం చేసారట)
ఇది కదూ ధర్మానుష్ఠానమంటే?
ధర్మమేదో తెలిసి,ఎవరో బాధపడతారనీ ..... పొనీ తనవారే, బాధపడతారనీ ధర్మానుష్టానం ఆపటం?...........................ఎలా?
వీరు కదూ గురువులంటే?
వీరికి కదూ గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని మనం చేతులెత్తాల్సినది?
ఒకాయన నిద్రలో ఆలోచనలకు పరీక్షపెడితే ఇంకొకాయన మెలకువలో ఆదమరుస్తాడేమోనన్న పరీక్ష.
ఇవన్నీ వింటుంటే ధర్మాన్ని ఆచరించటమే కాదు ఆ ధర్మాన్ని అందరికీ తెలిసేలా ఆచరించటమూ ఆవసరమే అన్నది కూడా అర్థమవదూ?
ఈ పెద్దాళ్ళకందరికీ తన మనసులోది ఎందుకు నిరూపించాలి?
ఇక్కడ నిరూపిస్తున్నది ఈ పెద్దాళ్ళకా?
అయోధ్యలో ఎంతమంది చాకలాళ్ళు ఉండింటారు?
వారికి కదూ ఈ నిరూపణలు?
బంగారు ప్రతిమ సీతమ్మకు స్వాంతనానికా?
తను నమ్మిన ధర్మాన్ని నేను ఏకపత్నీ వ్రతుడనే అంటూ ఎలుగెత్తి చాటటం కాదూ ?
ధర్మాచరణం............అదీ బహాటంగా, వినమ్రంగా, చిత్త శుధ్ధితో, త్రికరణంగా......... కంటే ధర్మప్రచారమేముంది?
శ్రీ చాగంటి.నెట్ వారికి, గురువుగారికీ కృతఙ్ఞతలతో
బహాటంగా
No comments:
Post a Comment