ఎందుకో ఈ సినిమాలో గంగ పాత్ర రోమాంటిక్ గా గుర్తుండిపోతే కాశీనాధుని స్త్రీగా గుర్తుండి పోయింది మాత్రం సంధ్యే. (మీనాక్షి కంటే సావిత్రే గుర్తుండిపోయినట్టు) అందుకని సంధ్య గురించే ముందుగా రాయాలనుకున్నాను.
మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న....కల్పిత పాత్రలను సజీవంగా చూడటమేం పిచ్చి అని. నిజంగా కల్పిత పాత్రలేనా? అసలులాంటి మనుషులూ, అనుభవాలూ ఉండవా అనేవి మళ్ళీ ఉపప్రశ్నలుగా వస్తాయి.
ఉంటాయి, వస్తాయి అన్న జవాబులు స్వానుభవంగా తెలుసుకున్నాను కాబట్టే, మనిషి మీద, ఆ మనిషి నడక మీదా, నడత మీదా పెద్దాయనకు ఉన్న నమ్మకం మీద నాకు గురి ఉంది కాబట్టే వీటిని పాత్రలుగా కాక నా ఆత్మీయులుగా హత్తుకుంటున్నాను. I want to see these as they were supposed to be seen, as you , me and all of us, rather than some exceptionals created by a crazy brahmin in his fantasy filled world.
గురువుగారు (శ్రీ చాగంటి.నెట్ చూడండి) రామాయణ ప్రవచనం చేస్తూ చేసే హెచ్చరిక నిజంగా దీనికి అన్వయించుకోవచ్చు అనిపిస్తుంది......"మీరు రామాయణం చదివేప్పుడు రాముని మానవమాత్రునిగా మాత్రమే చూడాలి, దేవునిగా తలవకూడదు. అప్పటికి కాని మీకు రామాయణ పారాయాణ ఫలం మీ జీవితంలో ప్రతిఫలించదు. రాముడు దేవుడు అనుకుంటే.....ఆ దేవుడు కాబట్టి అలా ధర్మం పై నిలబడ్డాడు అన్న భావన వచ్చేస్తుంది, మనం మానవులం మనమేం చెయ్యగలమలా అనిపిస్తుంది. కాని రాముని మానవ మాత్రునిగానే మహర్షి చిత్రణ చేసారు అలాగే మనమూ తీసుకుంటే అపౌడు మనకు రామాయణ పారాయణ ఫలం దక్కుతుంది అంటారు.
I really think we need some Idealistic, Utopian characters in our midst, inspiring us towards the ideal. may be then, we can achieve atleast 50%. If our kathaanaayakaas, kathaanaayikaas are ordinary ones, then, they will not be able to LEAD us. అలాటప్పుడు కావ్య ఫలమేముంటుంది? Anyways, I digress.
సంధ్య...రాయుని కూతురు. అంత సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. "వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చాము దాసును కలవాలి" అనడిగి, దాసుని దాసులు అపాయింట్మెంట్ లేదుగా కష్టమంటే గమ్మున వెళిపోయేంత .....ఏమనాలి? పరిపూర్ణ స్త్రీ అనాలా? పరిపూర్ణ మనిషి అనాలా? నాకైతే (గృహస్థం చేయకుండానే) వానప్రస్థానికి వచ్చిన మనిషి పరిణితి కనపడుతుంది సంధ్యలో. ఎదిగిన కూతురు స్వయంవరం చేసుకుని కూడా కన్యగా, కుంతిగా మిగిలిపోతానంటే చలించని సన్యాసాశ్రమవాసి రాయునికి సరైన కూతురుగా సంధ్య. కూతిరి ఈ చర్యల్లోని ప్రేమను మాత్రమే చూసిన పరిణితికి సరైన వారసురాలే సంధ్య.
తన సర్వస్వం అనుకున్న మనిషి, తనకెన్నడూ దక్కడనీ, ఆ మనిషి మనసులో తంకున్న స్థానం తనాశించినది కాదని, తనాశించిన స్థానం ఈ జన్మలో దొరకదనీ తెలిసి అతని ఆనవాలుతో దాసురాలయిన మనిషి సంధ్య. అలాటి సణ్ద్య మొహంలో ఎన్నో ఏళ్ళ తరవాత ఆ మనిషిని కలిస్తే...ఏపాటి బాధా వీచిక కూడా కలగదు.....ఆ మనిషి, తన మనిషి స్థాయి చూసి ఆనందంతొ ఉప్పొంగటమొక్కటే తెలుసు ఆ మనసుకు. "సాధ్యమేనా" అనే మనిషి మీమాంసకు సమాధనమే సంధ్య.
అమెరికాలో సెటిలయిన తల్లితండ్రుల చలవో, మణిపాల్లో వైద్యమభ్యసిస్తూ సేలవుల్లో చూసిపోయే తాత ఇచ్చిన సంస్కారమో కాని ఈనాటికీ సమాజానికి అచ్చమైన దర్పణంగా రెండవ జెనరేషన్ ఎన్నారై సంధ్య ఇంతగా హిందూ ధర్మానికి (ఇది "హిందూ ధర్మమే" అనటం లేదు. నాకు తెలిసింది హిందూ ధర్మమే కాబట్టి ఆ చట్రంలోనే నా ఆలొచన పరిధి) ఎలా కట్టుబడింది?
ఇదసలు ధర్మమేనా? రాయుడు సన్యాసాశ్రమానికి కట్టుబడక ఉండి ఉంటే అతనిని ఎంతో బాధ పెట్టే నిణయాలు తనవి. పైగా ఇంకొకరిని రేమిస్తున్న, ఆ ఇంకొకరికే...మనసా వాచా కర్మణా త్రికరనంగా.... అంకితమైపోయిన వ్యక్తి "పరాయి మగాడేగా?". పరాయి మగాడిని కోరుకునే స్త్రీగా సంధ్యకూ మరి రావణునికీ తేడా ఏమిటి? బలవంతం చెయ్యకపోవటమొక్కటేగా? స్వంతం చేసుకోవాలి అనే స్వార్థాన్ని ప్రేమ నుంచి వెలేయగలిగినందుకా ఇంత గౌరవం తనకు? అసలు నిజంగా స్వార్థాన్ని వెలేయగలిగిందా? తనకు కాని తన మనిషి చిహ్నాన్ని స్వంతం చేసేసుకుని అమ్మతనంలో వెలిగిపోతూ స్త్రీత్వాన్ని వదులుకోవటంలో ఏముంది గొప్ప? ఇలాటి జవాబు లేని ప్రశ్నలెన్నో సంధ్య పాత్రను తరిచితే.
ఒక మనిషి జీవితంలో అతని/ఆమె "ప్రవర్తన" " మాటా" చాలా కొద్ది శాతం మాత్రమే అతని/ఆమె గురించి తెలుసుకోటానికి తోడ్పడుతుంది. మిగితాదంతా, ఆమె/ఆతని "అసలంతా" వారి మనః అంతరాళాలో (మనోంతరాళాలు అనొచ్చా? ఎమో :-) విశర్గ సంధి సూత్రాలకు వికీ వెతికే ఓపికలేదు) మాత్రమే నిక్షిప్తం. కాని ధర్మమంటే.....ఒక మనిషి ప్రవర్తన ధర్మబధ్ధమేనా.....అనే నిర్ణయాలు త్రికరణాలు మూడూ కలిపిన సాక్షీత్వం మీదనే జరగాలి. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షికి బ్రహ్మగారు
"రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః ............
వైదేహేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః.
తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి"
అని వరమూ, అనుఙ్ఞా ఇచారట.
("నీకు నారదుడు నూరు శ్లోకాల్లో చెప్పిన సంక్షిప్త రమాయణమే కాకుండా అందరి మనః ప్రవృతూలూఅ, భవిష్యతూ కూడా గోచరిస్తుంది అని వరమూ, శ్రీరామాయణంలోని లోకవిదితాలనూ, రహస్యాలనూ కూడా రచించూ" అను అనుఙ్ఞ ఇచారట) . అలాటి వరమెవరో మనికిచ్చేంత వరకూ ఈలాటి ప్రశ్నలకు మన మన సంస్కారాలను బట్టి మాత్రమే జవాబులూ, మన మన ధారణలను బట్టి మాత్రమే ఆ జవాబులపై మన గురీ ఏర్పడుతాయి.
No comments:
Post a Comment