మన తెలుగు భాషలోను, సాహిత్యం లోనూ, జన జీవనం లోనూ వస్తున్న మార్పులని దిగాజారటం అని అనుకునే నేను, దాని గూర్చి ఆలోచిస్తూ పడ్డ మధనకు ఇది అక్షర రూపం. ఇది వ్రాయటానికి నన్ను తన ఆవేదనతో తెలికుండానే ప్రోత్సహించిన కలం స్నేహితురాలికి కృతజ్ఞతలు.
పతనమా లేక పరిణామమా ?
"బండి ర" ను జనం మరచి పోతున్నారని మధనపడే నేను
నేర్వని "లు లూ "ల ఉసే మరిచాను
"షంకర" అని బాలు కూడా ఖూని అరచేను
రోజు నేను చేస్తున్న ఖూనిల ఎరుకే ఎరగను
స్నానం చేయకనే వంట చేసే శ్రీమతిపై మండేను
కానీ తలవీడిన "శిఖను" తలవను
పూజలు పునస్కారాలు చేసే నేను
"చిత్త సుద్ధి లేని------" అన్న నానుడి మరచాను
భాష లోపించింది అని ఘోషించే మిత్రమా
నిజంగా అది లోపమా ? పరిణామమా?
ఎక్కడ రాజులు? ఎక్కడ పోషకులు? ఎక్కడ భ్రుతి?
పోషణ లేని కళలు ఎలా బ్రతికేను ఈ జగతి ?
లేకపోతే రాజ రాజ నరెంద్రుని ఆస్థానం
ఉండేదా అప్పటి నన్నయ కృతి ?
ప్రజాస్వామ్యం వచ్చిందని సంతసించే మనం
కొంత మూలం చెల్లించక తప్పదని మరిచాం
ఉండుంటే ప్రజాస్వామ్యం, కులికేనా
శ్రీనాధ కవి ఒక్కడు ముత్యాల పల్లకీన.
గుర్తు పట్టకలవా నేస్తం రాయల నాటి మన తెలుగు అక్షరం ?
అ"క్షరం" అంటూనే చూడమా దాని పతనం?
ఏడుస్తూనే కూర్చున్నామా మనం ?
లేదే, అక్షరాన్ని సర్దుకొని మరీ ముందుకు పోయాం.
అంటావు సాహిత్యపు విలువలు తరిగాయి
కానీ ఏది విలువల గీటురాయి?
అంటావు కళామతల్లి వలువలు మాసినవని
అందరు మెచ్చే వాటిని కాదనటం మనం ఎవరిమని?
నీకు నచ్చిన భాష వాడు, మెచ్చినవి ఆచరించు
మిగితా వారు అలా లేరని వగవకు నేస్తం
"తన కోపమే తన శత్రువు ----"
మరువకు ఈ సుభాషితం
అలా కాదని అంటావా, నీ ఇష్టం
కదులుతూనే ఉంది కాలం క్షణం, యుగం
జరిగే పరిణామం జరుగుతుంది
చివరక నీకు అశాంతే మిగిలేది.
No comments:
Post a Comment